English | Telugu

28 మందిని చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలి 

భారతీయ చిత్ర పరిశ్రమ మొదట్నుంచి కూడా మన దేశంలో ఏదైనా దురదృష్ట సంఘటనలు జరిగితే వాటిపై స్పందిస్తు భారతీయులంతా(Indians)ఒక్కటే అని తెలియచేస్తు ఉంటుంది. నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్(Kashmir)లోని పహాల్గమ్(Pahalgam)ఏరియాలో ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి కొంత మంది టూరిస్ట్ లు వచ్చారు. దీంతో ఉగ్రవాద మూక వాళ్లపై దాడి చేసి 28 మందిని అత్యంత పాశవికంగా చంపారు.

ఈ విషయంపైసోషల్ మీడియా వేదికగా చిరంజీవి(Chiranjeevi)స్పందిస్తు '28 మంది అమాయకులని బలిగొన్న దారుణమైన ఉగ్ర దాడి క్షమించరాని క్రూరమైన చర్య. హృదయ విధాకరమైన ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకి నా సానుభూతిని తెలుపుతున్నాను. ఈ నష్టం తీర్చలేనిదనిట్వీట్ చేసాడు. ఎన్టీఆర్(Ntr)స్పందిస్తు 'బాధితుల్ని చూస్తుంటే నా హృదయం బరువెక్కుతుంది. శాంతి కోసం ప్రార్ధించడంతో పాటు మృతుల కుటుంబాలకి నా సానుభూతిని తెలియచేస్తున్నాన్నంటు ట్వీట్ చెయ్యడం జరిగింది.

బాలీవుడ్ నటులు సంజయదత్(Sanjay dutt)అక్షయ్ కుమార్(Akshay Kumar)కూడా స్పందిస్తు అమాయకులని చంపడం చాలా దారుణం. ఎట్టి పరిస్థితులోను ఇది క్షమించరాని నేరం. ఈ ఉగ్ర చర్యపై అందరు మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుతున్నారు. అనుపమ్ ఖేర్(Anupam Kher)అయితే జరిగిన ఘటనపై కన్నీళ్లు పెట్టుకుంటు ఒక వీడియో కూడా చెయ్యడం జరిగింది. వీళ్ళే కాకుండా ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది ప్రముఖులు ఉగ్రచర్యని ఖండిస్తు సోషల్ మీడియా వేదికగా బాధితులకి తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం