English | Telugu

కల్కి సీక్వెల్.. దీపిక స్థానంలో ఎవరు బెస్ట్..?

'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కల్కి'లో సుమతి అనే కీలక పాత్ర పోషించింది దీపిక. నిజానికి ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. అలాంటిది సీక్వెల్ నుంచి దీపికను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీపిక పెడుతున్న మితిమీరిన కండిషన్స్ ని తట్టుకోలేకనే.. మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (Kalki 2)

'కల్కి-2' నుంచి దీపికను తొలగించడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కల్కి-2 లాంటి భారీ సినిమాకి గ్లోబల్ స్థాయి గుర్తింపు ఉన్న ప్రియాంక, ఐశ్వర్యలలో ఒకరిని తీసుకునే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ నుంచి అలియా భట్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. సుమతి పాత్రకు సరిగ్గా సరిపోతుందంటూ కొందరు ఏఐ ఫొటోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మలయాళ చిత్రం 'లోకా'తో సంచలనం సృష్టించిన కళ్యాణి ప్రియదర్శన్ కూడా బెస్ట్ ఆప్షన్ అంటున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీరితో పాటు రుక్మిణి వసంత్, కృతి సనన్, అనుష్క శెట్టి, సమంత, నయనతార వంటి పేర్లు కూడా కొందరు సూచిస్తున్నారు.

కల్కి సీక్వెల్ లో దీపిక స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.