English | Telugu

ప్రభాస్ తో అభిషేక్ బచ్చన్ ఢీ!

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)తన అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ 'కేరళ' లో పాటల చిత్రీకరణలో ఉందని, ఆ తర్వాత విదేశాల్లో మరికొన్ని పాటలని చిత్రీకరించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని కూడా 'ప్రభాస్' పారలాల్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని షెడ్యూల్స్ ని కూడా జరుపుకుంది. పీరియాడిక్ అంశాలతో కూడిన మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ మూవీలో బాలీవుడ్ బడా హీరో 'అభిషేక్ బచ్చన్'(Abhishek Bachchan)నటించబోతున్నాడనే వార్తలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రభాస్ తర్వాత కథలో ఒక కీలకమైన క్యారక్టర్ ఉందని, ఆ క్యారక్టర్ కి బాలీవుడ్ హీరో అయితే సరిపోతాడని భావించి, మేకర్స్ 'అభిషేక్ బచ్చన్' ని సంప్రదించారనే వార్తలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అభిషేక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అంటున్నారు. కొంత కాలం నుంచి హిందీ చిత్రసీమకి చెందిన హీరోలు, తెలుగు చిత్రాల్లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడనే చర్చ కూడా జరుగుతుంది.

అభిషేక్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)నట వారసుడిగా రెండున్నర దశాబ్డల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఎన్నో వైవిద్యమైన క్యారక్టర్ లని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించడం అభిషేక్ స్పెషాలిటీ. ఈ ఏడాది' హౌస్ ఫుల్ 5 ', 'కాళిధర్ లాపాతా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రాజాశివాజీ లోను టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ బాహుబలి దగ్గర్నుంచి నార్త్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి కాంబో పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ ని ఏర్పాటు చేసుకోవడం ఖాయం.



సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.