English | Telugu

ఎన్టీఆర్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. వాటిని నా తర్వాతి సినిమాలో వాడతాను!

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘వార్‌2’ ఆగస్ట్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. వేలాది అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో హృతిక్‌రోషన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

‘ఇక్కడికి వచ్చిన టైగర్‌ ఫ్యాన్స్‌కి థాంక్స్‌. ఎన్టీఆర్‌ మీ అందరికీ అన్న, నాకు మాత్రం తమ్ముడు. మనందరం ఒకే కుటుంబం. నా తమ్ముడ్ని ఇప్పటివరకు ఎంతగా ఆదరించారో ఎప్పటికీ అలాగే మీ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్‌ను సెట్‌లో యాక్ట్‌ చేస్తున్నప్పుడు అతనిలో నన్ను నేను చూసుకున్నాను. అంతగా నన్ను ఇంప్రెస్‌ చేశాడు. అతని నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను. సింగిల్‌ టేక్‌ ఫైనల్‌ టేక్‌ హీరో ఎన్టీఆర్‌. షాట్‌ చేసేటపు దాన్ని 100 పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ చెయ్యడానికి ట్రై చేస్తాడు. అలాంటి విషయాలు ఎన్నో ఎన్టీఆర్‌ దగ్గర నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాలో వాటిని తప్పకుండా వాడతాను. నేను చాలా కాలం క్రితం క్రిష్‌ షూటింగ్‌ కోసం ఇక్కడికి వచ్చాను. తెలుగు వారు ఎంతో ప్రేమ చూపిస్తారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను, ఎన్టీఆర్‌ దాదాపు ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు కోస్టార్స్‌గా నటించాం. అయితే రియల్‌ లైఫ్‌లో బ్రదర్స్‌గా మారిపోయాం. మేం మళ్లీ కలిసి సినిమా చేసినా చెయ్యకపోయినా, మా బంధం ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్‌ మంచి చెఫ్‌ కూడా. అతని చేతితో వండిన బిర్యాని తినడానికైనా మళ్లీ కలుస్తాను. అంతటి అనుబంధం మా మధ్య పెరిగింది’ అన్నారు హృతిక్‌ రోషన్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.