English | Telugu

అభిమానుల ఆశ నెరవేరనట్టేనా! 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan)ల అప్ కమింగ్ మూవీ 'వార్ 2'(War 2)ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ వేదికగా అభిమానులు, సినీ ప్రముఖుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. వార్ 2 ఘన విజయం సాధించి ఈ ఏడాది 'హృతిక్ రామారావు నామ సంవత్సరంగా మారనుందని, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారంటే, వార్ 2 పై ఇండస్ట్రీలో, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఈవెంట్ లో 'ఎన్టీఆర్' మాట్లాడుతు ఎన్ని సంవత్సరాలు, యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు. ఆయన ఆశీస్సులు నాపై ఉన్నంత కాలం నన్ను ఎవరు ఆపలేరని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో కొంత మంది అభిమానులు ఎన్టీఆర్ ని ఉద్దేశించి 'సిఎం' అని అరవడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్
స్పందిస్తు 'మీ ప్రేమకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.ఈ జీవితం మీకే అంకితం. ఇంత కంటే శక్తీ ఏది అవసరం లేదు. ఈ జన్మకి ఈ ప్రేమ చాలు. జీవితాంతం మిమ్మల్ని సంతోషపెడుతు నా అడుగులు ముందుకు వెళ్తాయి. మిమ్మల్ని బాధపెట్టడానికి నా అడుగులు ఉండవని చెప్పాడు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉన్నత శిఖరాలని అందుకోవాలని చాలా మంది అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ స్పీచ్ తో పాలిటిక్స్ లోకి రాడనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ, రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ ముగిసాక కూడా కొంత మంది అభిమానులు మాట్లాడుతు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పీచ్ వైరల్ గా మారింది. ఇక వార్ 2 లో కియారా అద్వానీ(Kaira adwani)హీరోయిన్ కాగా ఆమె ఇటీవల ఒక బిడ్డకి జన్మనివ్వడంతో ఈవెంట్ లో పాల్గొనలేకపోయింది. యష్ రాజ్ ఫిల్మ్స్, సుమారు 400 కోట్ల బడ్జెట్ తో వార్ 2 ని నిర్మించింది. అయన్ ముఖర్జీ(Ayan mukerji)దర్శకుడు.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.