English | Telugu

సైలెంట్ గా 'వార్ 2' షూటింగ్ మొదలైంది

జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా ప్రారంభమైంది.

నిన్న(అక్టోబర్ 17న) స్పెయిన్ లో 'వార్ 2' షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లో కార్ చేజ్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ ప్రారంభమవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్వరలోనే ప్రధాన తారాగణం ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'దేవర' చేస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రస్తుతం 'దేవర-1' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తి కాగానే 'వార్ 2' సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు ఎన్టీఆర్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.