English | Telugu

అనూహ్యంగా పుంజుకున్న వార్-2.. కూలీకి షాక్ తప్పదా?

ఆగస్టు 14న 'వార్-2', 'కూలీ' అనే రెండు భారీ సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. ఈ రెండు సినిమాలపైనా మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే 'వార్-2'తో పోలిస్తే 'కూలీ'పై హైప్ ఇంకా ఎక్కువ ఉంది. అది అడ్వాన్స్ బుకింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది. అయితే విడుదల తర్వాత ఈ రెండు సినిమాలు డివైడ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో 'వార్-2' దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కూలీ' మాత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ తో సత్తా చాటింది. ఇలా అడుగడుగునా కూలీ డామినేషన్ కనిపిస్తోంది. దీంతో ఇక 'వార్-2' పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇలాంటి టైంలో 'వార్-2' అనూహ్యంగా పుంజుకొని షాక్ ఇచ్చింది.

ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా పాజిటివ్ టాక్ రాకపోతే వీక్ డేస్ లో భారీ డ్రాప్ కనిపించడం సహజం. 'వార్-2', 'కూలీ' సినిమాల విషయంలోనూ అదే జరిగింది. సోమవారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ముఖ్యంగా 'వార్-2' పూర్తిగా చేతులెత్తేసినట్లు అనిపించింది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా పుంజుకొని బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది వార్-2.

మంగళవారం నాడు బుక్ మై షోలో బుకింగ్స్ ని గమనిస్తే.. 'వార్-2' టికెట్లు గంటకు 9.2K బుక్ అవ్వగా, 'కూలీ' టికెట్లు మాత్రం 4.9K బుక్ అయ్యాయి. అంటే బుక్ మై షోలో 'కూలీ'కి దాదాపు రెట్టింపు స్థాయిలో 'వార్-2' టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఫుల్ రన్ లో 'కూలీ'కి 'వార్-2' షాకిచ్చినా ఆశ్చర్యంలేదు.

ఓవరాల్ గా ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'వార్-2'కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించినప్పటికీ తెలుగు బుకింగ్స్ లో ఆ జోష్ లేదు. నార్త్ లో మాత్రం జోష్ కనిపిస్తోంది. హిందీ సినిమా కావడం, ప్రస్తుతం అక్కడ ఇతర స్టార్ల సినిమాలు లేకపోవడంతో.. వార్-2 చూడటానికి నార్త్ ఆడియన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే బుక్ మై షోలో 'కూలీ'ని 'వార్-2' ఈ రేంజ్ లో డామినేట్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.