English | Telugu

డిసెంబర్ లో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆగస్టు 25న 'గాండీవధారి అర్జున' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకే ఆయన మరో సినిమాతో అలరించనున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో 13వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు-హిందీ భాషల్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ తాజాగా ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుందని, డిసెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు.

#VT13 టీమ్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ పూర్తయిన విషయాన్ని తెలుపుతూ మేకర్స్ రివిల్ చేసిన పోస్టర్‌లో వరుణ్ తేజ్ యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న ఐఏఎఫ్ అధికారిగా కనిపిస్తున్నారు.

ఈ యాక్షన్ డ్రామా టైటిల్‌ను త్వరలో అనౌన్స్ చేస్తారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ ఈ చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా 'ఓజీ'ని కూడా డిసెంబర్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి డిసెంబర్ లో బాబాయ్, అబ్బాయ్ ల బాక్సాఫీస్ పోరు ఉంటుందేమో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.