English | Telugu

వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక విడాకులు!

మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో చైతన్య కనిపించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక తన భర్త నుంచి విడిపోయినట్లు తాజాగా క్లారిటీ వచ్చేసింది.

2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. పెళ్ళయిన మొదటి ఏడాదిన్నర, రెండేళ్ళు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ తరువాత ఏవో కారణాల వల్ల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూన్ 9న జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో నిహారిక భర్త చైతన్య కనిపించకపోవడంతో విడాకులపై దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా వీరి విడాకుల పిటిషన్, కోర్టు ఆర్డర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏప్రిల్/మే సమయంలో నిహారిక-చైతన్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 5 న వీరి విడాకులు మంజూరు అయ్యాయి. అంటే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక, చైతన్య విడిపోయారన్నమాట.

తాజాగా నిహారిక కూడా సోషల్ మీడియా వేదికగా తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.