English | Telugu

సుప్రీమ్ హీరో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా 'విరూపాక్ష'

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. రూ.34 కోట్ల షేర్ తో 'ప్రతిరోజూ పండగే' ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవగా.. ఇప్పుడు విరూపాక్ష ఆ రికార్డుని బ్రేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేసేలా ఉంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.30 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో 40 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.

రూ.23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన విరూపాక్ష.. ఆరు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.29.91 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఆరో రోజైన నిన్న 2.24 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. ఈరోజు కూడా మరో రెండు కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. శుక్రవారం నుంచి 'ఏజెంట్' రూపంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశమున్నప్పటికీ.. విరూపాక్ష కి వచ్చిన అదిరిపోయే పాజిటివ్ టాక్ ని బట్టి చూస్తే.. కనీసం మరో పది కోట్ల షేర్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆరు రోజుల్లో నైజాంలో రూ.10.42 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.3.42 కోట్లషేర్, ఆంధ్రాలో రూ.9.77 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.23.61 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.2.10 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.4.20 కోట్ల షేర్ కలిపి.. ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.29.91 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ వీకెండ్ లోపు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచే అవకాశముంది. మరోవైపు యూఎస్ లో ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.