English | Telugu

'పుష్ప-2' సెట్స్ లో ఎన్టీఆర్!

టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఎంత మంచి అనుబంధముందో తెలిసిందే. ఇద్దరూ బావ బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'హ్యాపీ బర్త్ డే బావ' అని ట్వీట్ చేసిన తారక్ 'పార్టీ లేదా పుష్ప' అని అడగడం.. దానికి 'వస్తున్నా' అని బన్నీ రిప్లై ఇవ్వడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించింది. ఇక తాజాగా 'పుష్ప-2' సెట్స్ లో తారక్ సందడి చేయడం ఫ్యాన్స్ కి మరింత ఆనందాన్ని ఇచ్చింది.

ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తుండగా.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప-2' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తారక్ 'పుష్ప-2' సెట్స్ లో సందడి చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలోనూ పలు సినిమా వేడుకల్లో, షూటింగ్స్ లో తారక్-బన్నీ ఇలాగే కలిశారు. పదేళ్ల క్రితం బాద్ షా, ఇద్దరమ్మాయిలతో సినిమాల షూటింగ్ కూడా ఒకే సమయంలో ఒకే చోట జరగగా.. చిత్ర బృందాలతో కలిసి తారక్, బన్నీ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చారు. పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఇనేళ్ళుగా వారి మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతుండటం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.