English | Telugu

నితిన్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ వచ్చాడా!

తెలుగు చిత్రసీమలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)నితిన్(Nithiin)కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సుదీర్ఘ కాలం నుంచి సిల్వర్ స్క్రీన్ పై తమదైన పెర్ ఫార్మెన్స్ తో అభిమానులని ప్రేక్షకులకి అలరిస్తు వస్తున్నారు. కాకపోతే కొంత కాలం నుంచి ఈ ఇద్దరికి విజయం అనేది ఆమడ దూరంలో ఉంటు వస్తుంది. సదరు చిత్రాల్లో పెర్ ఫార్మెన్స్ పరంగా తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించినా, కథతో పాటు కథనం లోని లోపాల వల్ల పరాజయం చెందుతున్నాయి. ఆ ఇద్దరి ప్రీవియస్ చిత్రాలైన తమ్ముడు, కింగ్ డమ్ లే ఉదాహరణ.


ఈ ఇద్దరిలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో 'రౌడీ జనార్దన్' అనే చిత్రంతో పాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యియన్ దర్శకత్వంలో మూవీ ఉంది. నితిన్ నుంచి మాత్రం కొత్త చిత్రం ప్రకటన రాలేదు. వేణు దర్శకత్వంలో తెరకెక్కబోయే 'ఎల్లమ్మ' కి మొదట నితిన్ ని అనుకున్న విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లోకి వేరే హీరో వచ్చాడు. రీసెంట్ గా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న కథనాల ప్రకారం నితిన్ ని అనుకున్న మరో ప్రాజెక్ట్ లోకి విజయ్ దేవరకొండ వచ్చినట్టుగా తెలుస్తుంది. నితిన్ తో అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ 'మనం' మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం అనుకుంది. ఈ మేరకు గతంలో వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ ఖాతాలో చేరినట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కి విక్రమ్ కథ చెప్పాడని, విజయ్ కి కూడా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. విభిన్న చిత్రాలని తెరకెక్కించే దర్శకుడిగా అయితే విక్రమ్ కుమార్(Vikram k kumar)కి ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.