English | Telugu

జగపతిబాబు ఫాదర్ విబి రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ తెలుగు సినీ నటుడు జగపతిబాబు తండ్రే ఈ వీబీ రాజేంద్రప్రసాద్‌. తనయుడు జగపతిబాబు పేరు మీదనే ‘జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌ని స్థాపించి, ఆ బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాల్ని రాజేంద్రప్రసాద్‌ నిర్మించారు. ఆయన 1932, నవంబర్ 4న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. రాజేంద్రప్రసాద్‌ 1965లో నిర్మించిన అంతస్తులు సినిమాకు (ఉత్తమ చిత్రం) జాతీయ అవార్డు మరియు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకొన్నారు. ఆ తరువాత 1966లో నిర్మించిన ఆస్తిపరులు సినిమాకు మళ్ళీ ఫిలిం ఫేర్ అవార్డు అందుకొన్నారు. ప్రతిష్టాత్మకమయిన రఘుపతి వెంకయ్య అవార్డు, కెవి రెడ్డి అవార్డు కూడా అందుకొన్నారు.ఆయన ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, అదృష్టవంతులు, దసరాబుల్లోడు, సింహ స్వప్నం మొదలయిన 16సినిమాలను స్వయంగా నిర్మించారు. దసరా బుల్లోడు, బంగారు బాబు, భార్య బర్తల బంధం, బంగారు బొమ్మలు, మంచి మనసులు వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.