English | Telugu

"వస్తాడు నారాజు"కి సెన్సారు క్లీన్ "యు"

24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ పైన తన తొలి ప్రయత్నంగా "వస్తాడు నారాజు" అనే సినిమాని తానే హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు విష్ణువర్థన్.ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో తాప్సి కథానాయికగా నటించింది.

మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.ఈ చిత్రంలో విష్ణువర్థన్ వెంకటప్పయ్య నాయుడు అనే కిక్ బాక్సర్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రం ఇటీవలే సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సారు వారు క్లీన్ "యు" సర్టిఫికేట్ ను ఇవ్వటం జరిగింది.ఈ చిత్రం ఫిబ్రవరి 11 న విడుదల కానుంది.

iframe title="YouTube video player" width="480" height="390" src="http://www.youtube.com/embed/K3fSycAgv0g" frameborder="0" allowfullscreen>

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.