English | Telugu

హరీష్ శంకర్ వ్యాఖ్యలతో పవన్ ఫాన్స్ లో ఖుషి 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ ఫాన్స్ ఉస్తాద్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ కి పవన్ నటించినఒక సినిమా సీన్ ని టాగ్ చేసాడు. దానికి హరీష్ తనదయిన స్టైల్లో రిప్లై ఇచ్చి పవన్ ఫాన్స్ లో హుషారు ని తీసుకొచ్చాడు.

పవన్ అభిమాని ఒకరు గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ అయిన అభిమన్యు సింగ్ కి పవన్ వార్నింగ్ ఇచ్చే ఇంటర్వెల్ సీన్ ని హరీష్ శంకర్ కిటాగ్ చేస్తూ.. ఈ వార్నింగ్ సీన్ ని మించిన సీన్ ఏ సినిమాలో అయినా ఉందా? ఒక వేళ ఉంటే చూపించండి అంటూ ఒక కొటేషన్ ని కూడా మెన్షన్ చేసాడు. దానికి హరీష్ శంకర్ యస్ బ్రో వెయిట్ ఫర్ ఉస్తాద్ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ని చూసి పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఖచ్చితంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్ ని మించే స్థాయిలోనే ఉస్తాద్ ఇంటర్వెల్ సీన్ ఉండబోతుందని చెప్పకనే చెప్పాడని పవన్ ఫాన్స్ అంటున్నారు.

స్క్రీన్ మీద పవన్ ని పవర్ ఫుల్గాప్రెజెంట్ చెయ్యగల దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ కి వరుస ప్లాపుల నుంచి విముక్తిని కల్పించాడు. గబ్బర్ సింగ్ ని హరీష్ తెరకెక్కించిన విధానం సూపర్ గా ఉంటుంది. ఆ మూవీ తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో రికార్డులని కూడా సాధించింది. ఇప్పుడు ఆ రికార్డులన్ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తో మాయం కావడం ఖాయమని పవన్ ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.