English | Telugu

తుంగ‌భ‌ద్ర‌.. డౌటేనా?

వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌కి ఓ ఇమేజ్ ఉంది. వ‌రుస‌గా మంచి సినిమాలు తీస్తూ.. ప‌రిశ్ర‌మ‌నీ, ప్రేక్ష‌కుల్నీ ఆక‌ట్టుకొందా సంస్థ‌. ఈగ‌, లెజెండ్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్యా.. సినిమాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తుంగ‌భ‌ద్ర సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టింది. ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. ఆ త‌ర‌వాత మార్చి 6, మార్చి 13 అంటూ డేట్లు మార్చారు. ఇప్పుడు 20 న వ‌స్తోందంటున్నారు. ఈ సినిమాకి సాయి కొర్ర‌పాటికి న‌మ్మ‌కం లేదని, అందుకే విడుద‌ల తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ సినిమాని కొనడానికి బ‌య్య‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. త‌న రిస్క్‌పైనే ఈసినిమాని విడుద‌ల చేస్తున్నాడు కొర్ర‌పాటి. హీరోకి ఇమేజ్ లేదు, హీరోయిన్‌కి గ్లామ‌ర్ లేదు. టోట‌ల్‌గా ఈ సినిమాకి హైప్ లేదు. మ‌రి తుంగభ‌ద్ర ఈ నెల 20న వ‌చ్చి ఏం చేస్తుందో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.