English | Telugu

ల‌య‌న్‌ని అమ్మేశారు

శాటిలైట్ మార్కెట్ ఈ రోజుల్లో సినిమా వ్యాపారంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఓ సినిమా విడుద‌ల‌కు ముందే శాటిలైట్ హ‌క్కుల్ని అమ్ముకోవ‌డ నిర్మాత‌కు అత్య‌వ‌స‌రం. చిన్న సినిమా వైపు నిర్మాత‌లు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. అయితే స్టార్ హీరోల సినిమాలు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా లయ‌న్ శాటిలైట్ హ‌క్కులు అమ్ముడుపోయాయి. రూ.6.25 కోట్ల‌తో ల‌య‌న్ హ‌క్కుల్ని జెమిని సొంతం చేసుకొంది. లెజెండ్‌తో పోలిస్తే.. ల‌య‌న్ త‌క్కువ రేటుకే ద‌క్కించుకొంది జెమిని. బాల‌కృష్ణ స‌ర‌స‌న త్రిష‌, రాధికా ఆప్టే జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి స‌త్య‌దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈనెల 28న ల‌య‌న్ పాట‌ల్ని విడుద‌ల చేస్తారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.