English | Telugu

ఈసారి ఈ మూడు సినిమాల మధ్య లొల్లి మొదలైంది

పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయంటే.. అందరికీ గుర్తొచ్చేది థియేటర్ల సమస్య. సంక్రాంతి, దసరా సీజన్లలో రిలీజ్‌ అయ్యే సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతూనే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆ ప్రాసెస్‌లో పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతుంటాయి. ఈ దసరాకి భగవంత్‌ కేసరి, టైగర్‌ నాగేశ్వరరావు, లియో విడుదలవుతున్నాయి. భగవంత్‌ కేసరి, టైగర్‌ నాగేశ్వరరావు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు కాగా, లియో డబ్బింగ్‌ సినిమా. ఈ మూడు సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక థియేటర్ల విషయంలో తప్పకుండా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలకు థియేటర్ల సమస్య ఏర్పడిరది. అప్పుడు కూడా డబ్బింగ్‌ సినిమా విజయ్‌దే కావడం గమనార్హం. అప్పటికి ఏదో ఎడ్జస్ట్‌మెంట్‌ చేసుకొని సినిమాలను రిలీజ్‌ చేసుకున్నారు.

ఇప్పుడు దసరాకి విడుదలయ్యే సినిమాలకు కూడా ఆ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. రెండు తెలుగు సినిమాల మధ్య డబ్బింగ్‌ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఈ మూడు సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. లియో చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తోంది. థియేటర్ల విషయంలో సితార నాగవంశీకి మంచి గ్రిప్‌ ఉంది. భగవంత్‌ కేసరి, టైగర్‌ నాగేశ్వరరావు నిర్మాతలతో పోలిస్తే నాగవంశీ ఈ విషయంలో ఎక్స్‌పర్ట్‌ అనే చెప్పాలి. వాస్తవానికి స్ట్రెయిట్‌ సినిమాలకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తారు. అయితే లియోకి ఉన్న క్రేజ్‌, నాగవంశీ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తుండడంతో ఆ సినిమాకి కూడా ఎక్కువ థియేటర్లు కేటాయించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం థియేటర్ల విషయంలో లోలోపల వాదనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రిలీజ్‌ ఇంకా నాలుగు రోజులు ఉంది. అప్పటికల్లా థియేటర్ల వ్యవహారంలో జరుగుతున్న గొడవలు బయటికి రావచ్చంటున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.