English | Telugu

'టెంపర్' హంగామాకి రెడీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన 'టెంపర్' చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ బెనిఫిట్ షో రేపు ఉదయం 3.45నిముషాలకు హైదరాబాద్ కూకట్ పల్లిలోని మల్లిఖార్జున థియేటర్ లో స్ర్కీనింగ్ కానుంది.ఈ బెనిఫిట్ షో కి భారీ క్రేజ్ నెలకొంది. ఈ షో ని డైరెక్టర్ రాజమౌళి, పూరి జగన్నాధ్ తో పాటు ఈ చిత్రం యూనిట్ కి చెందిన కొంతమంది సాంకేతిక నిపుణులు కూడా వీక్షించబోతున్నారట. రాంగోపాల్ వర్మ కూడా ఈ షోని చూడబోతున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో చిందేయబోతున్నానని ఇప్పటికే రామూ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సో... 'టెంపర్' సందడి షురూ అయిపోయింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.