English | Telugu

Telusu Kada: 'తెలుసు కదా' షాకింగ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవుతుందా..?

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. గత చిత్రం 'జాక్'తో దారుణంగా నిరాశపరిచాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి, డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'తెలుసు కదా'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు సిద్ధు. 'జాక్' వంటి డిజాస్టర్ తర్వాత వస్తున్నప్పటికీ.. ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. (Siddhu Jonnalagadda)

నైజాంలో రూ.8 కోట్లు, సీడెడ్ లో రూ.2.50 కోట్లు, ఆంధ్రాలో రూ.6 కోట్లతో.. 'తెలుసు కదా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.16.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో రూ.5.50 కోట్ల బిజినెస్ చేసిందని.. దీంతో వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ సాధించి, హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.22 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. (Telusu Kada)

రేపు(అక్టోబర్ 16) థియేటర్లలో అడుగుపెడుతున్న 'తెలుసు కదా'పై పెద్దగా బజ్ లేదు. ప్రచార చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పైగా, 'జాక్' వంటి డిజాస్టర్ తర్వాత సిద్ధు నటించిన చిత్రమిది. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా 'తెలుసు కదా' సినిమా రూ.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. మరి ఈ సినిమాతో సిద్ధు సర్ ప్రైజ్ హిట్ అందుకుంటాడో లేక 'జాక్'లా మరో షాక్ తింటాడో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.