English | Telugu

అలియాభట్ ఇంటికి కర్ణాటక వినాయకుడు..ప్రత్యేకతలు ఇవే  

భారతీయ చిత్రపరిశ్రమలో అలియాభట్(Alia Bhatt),రణబీర్ కపూర్(Ranbir Kapoor)జంటకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇద్దరు తమ సినీకెరీర్ పీక్ లో కొనసాగుతున్నప్పుడే వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం కూడా అదే స్థాయిలో విజయాల్ని అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నారు. 'రామాయణ'(Ramayana)తో రణబీర్ బిజీగా ఉండగా, అలియాభట్ 'ఆల్ఫా' అనే చిత్రంతో బిజీగా ఉంది. సదరు చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.

అలియాభట్ దంపతులు ఈ నెల 17 న ముంబై(Mumbai)లోని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఈ మేరకు ఇంట్లో గణపతి(Ganapathi)విగ్రహాన్ని ప్రతిష్టించడం కోసం కర్ణాటకలోని మైసూరుకి చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు 'అరుణ్ యోగిరాజ్' కి కొన్నినెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు. దీంతో అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj)నల్లఏకశిలపై చెక్కిన అందమైన గణపతిని రూపొందించాడు. భక్తులని ఎంతగానో కట్టిపడేసేలా ఉన్న ఆ అందమైన గణనాధుడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండగా, విగ్రహాన్ని చెక్కడానికి యోగిరాజ్ కి ఆరునెలల సమయం పట్టింది. రీసెంట్ గా గణనాధుడి విగ్రహం అలియాభట్ ఇంటికి చేరగా, యోగిరాజ్ కి ఎంత డబ్బులు చెల్లించారనే విషయం మాత్రం బయటకి రాలేదు.

అయోధ్య బాల రాముడ్ని(Ayodhya Balaramudu)కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. సదరు బాల రాముడ్ని చూస్తు భక్తులందరు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నారు.



ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.