Read more!

English | Telugu

రామ్ చరణ్ రచ్చలో కలర్స్ స్వాతి లేదు

రామ్ చరణ్ "రచ్చ" లో కలర్స్ స్వాతి లేదు అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్‍, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి దర్శకుడి అభ్యర్థన మేరకు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని ముందుగా వినపడింది.

కానీ అది నిజం కాదనీ రామ్, హన్సిక జంటగా నటిస్తున్న "కందిరీగ" సినిమాలో మాత్రమే స్వాతి అతిథి పాత్రలో నటిస్తూందనీ, అలాగే గతంలో స్వాతితో "అనంతపురం 1980"అనే సినిమా తీసిన యూనిట్ తీస్తున్న ఒక తమిళ సినిమాలో మాత్రమే స్వాతి నటిస్తున్నదనీ తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ "రచ్చ" సినిమా షుటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్ల చిత్రీకరణలో ఉంది.