English | Telugu

రామ్ చరణ్ రచ్చలో కలర్స్ స్వాతి లేదు

రామ్ చరణ్ "రచ్చ" లో కలర్స్ స్వాతి లేదు అని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్‍, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "రచ్చ". ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి దర్శకుడి అభ్యర్థన మేరకు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని ముందుగా వినపడింది.

కానీ అది నిజం కాదనీ రామ్, హన్సిక జంటగా నటిస్తున్న "కందిరీగ" సినిమాలో మాత్రమే స్వాతి అతిథి పాత్రలో నటిస్తూందనీ, అలాగే గతంలో స్వాతితో "అనంతపురం 1980"అనే సినిమా తీసిన యూనిట్ తీస్తున్న ఒక తమిళ సినిమాలో మాత్రమే స్వాతి నటిస్తున్నదనీ తెలిసింది. ప్రస్తుతం రామ్ చరణ్ "రచ్చ" సినిమా షుటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్ల చిత్రీకరణలో ఉంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.