English | Telugu

ఎస్తర్ నొరోన్హా రెండో పెళ్లి? వరుడు అతనేనా!

'ఎస్తర్ నోరోన్హా'(ester Noronha)2019 అక్టోబర్ లో ప్రముఖ సింగర్, నటుడు నోయల్(Noyel)ని వివాహం చేసుకుంది. పట్టుమని పదహారు రోజులు కూడా ఆ ఇద్దరు కలిసి లేరు. దీంతో 2020 లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి ఎస్తర్ ఒంటరిగానే ఉంటు పలు చిత్రాలతో బిజీగా ఉంటు వస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు నాకు ఒంటరిగా బతకాలని లేదు. అందమైన జీవితం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి కోసం వెతుకుతున్నాను. షోకేస్ లాంటి భర్త మాత్రం వద్దని చెప్పుకొచ్చింది. దీంతో ఎస్తర్ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తు వస్తున్నారు.

నిన్న ఎస్తర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకి సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు వెల్లడి చేసారు. ఈ క్రమంలో రీసెంట్ గా 'ఎస్తర్' సోషల్ మీడియా వేదికగా క్రిస్టియన్ పద్దతిలో ముస్తాబైన నవ వధువుగా ఒక పిక్ ని షేర్ చేస్తు 'నా జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. అవకాశాలతో పాటు ఎన్నో అవకాశాలు ఇచ్చినందుకు కూడా దేవుడి కి కృతజ్ఞతలు. పుట్టిన రోజున విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీతో ప్రతేకమైన ప్రకటనని పంచుకోబోతున్నాను. న్యూ అనౌన్స్ మెంట్ కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ని ఉంచింది. ఆ కమింగ్ న్యూస్ పెళ్ళికి సంబంధించిందే అని
అభిమానులు అనుకోవడంతో పాటు, తనకి నచ్చిన లక్షణాలు ఉన్న వ్యక్తి వరుడుగా రావాలని మెసేజెస్ చేస్తున్నారు..

2013 లో విడుదలైన 'వెయ్యి అబద్దాలు' అనే చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఎస్తర్, ఇప్పటివరకు తెలుగు, హిందీ, కన్నడ, కొంకిణి, మరాఠీ భాషల్లో సుమారు ఇరవై ఐదుకి పైగా చిత్రాల్లో చేసింది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తు బిజీగా ఉన్న 'ఎస్తర్' ఈ ఏడాది ఫిబ్రవరిలో 'తల' అనే మూవీతో పలకరించింది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.