English | Telugu

"తను వెడ్స్ మను" లో సాయిరాం, ఛార్మి

సాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు. కంగనా రనౌత్ ‍, మాధవన్ కలసి నటించగా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన "తను వెడ్స్ మను" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ చిత్రంలో హీరోగా సాయిరాం శంకర్, హీరోయిన్ గా ఛార్మి నటించబోతున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సొంతం చేసుకున్నారు.

చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, దిల్ రాజు కలసి నిర్మిస్తారట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఛార్మి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో నటిస్తుంది. ఆ కారణంగానే పురీ జగన్నాథ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.