English | Telugu

రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్‌ మృతి!

ఈమధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వరుస విషాద వార్తలు వింటున్నాము. దక్షిణాది సినీ పరిశ్రమలోనే ఈ విషాద వార్తలు చోటు చేసుకోవడం గమనార్హం. మలయాళ ఇండస్ట్రీలోనే ఈమధ్య ఎక్కువ మరణాలు సంభవించాయి. టీవీ ఆర్టిస్టులు రెంజుషా మీనన్‌ ఆత్మహత్య చేసుకోగా, డా.ప్రియ గుండెపోటుతో మరణించారు. ఇటీవల టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ కుడుముల కజిన్‌ తీవ్రమైన జ్వరంతో మృతి చెందారు. ఇక యాంక్‌ రaాన్సీ పర్సనల్‌ సెక్రటరీ శ్రీను గుండెపోటుతో చిన్నవయసులో కన్ను మూశారు. ఇవన్నీ మరచిపోక ముందే మరో విషాద వార్త వినాల్సి వస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్‌ అర్పుదాన్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చెన్నయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రూప్‌ డాన్సర్లలో ఒకరిగా తన కెరీర్‌ని స్టార్ట్‌ చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాఘవ లారెన్స్‌కు లైఫ్‌ ఇచ్చారు దర్శకుడు అర్పుదాన్‌. 2002లో వచ్చిన ‘అర్పుతం’ అనే సినిమాతో లారెన్స్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అర్పుదాన్‌ దర్శకత్వంలో సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ ఈ సినిమాను నిర్మించింది. తమిళ్‌లో ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. లారెన్స్‌ హీరో కెరీర్‌కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడిరది. మనతోడు, మజైకాలం అనే చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు అర్పుదాన్‌. తెలుగులో ఉదయ్‌ కిరణ్‌తో లవ్‌ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.