English | Telugu

మహేష్ బాబు మనసు బంగారం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవాకార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పటికే ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్.. తాజాగా మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు.

తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి 2020లో 'మహేష్ బాబు ఫౌండేషన్'ని స్థాపించాడు మహేష్. ఈ ఫౌండేషన్ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో జన్మించిన శిశువులకు అండగా నిలుస్తోంది. దీని ద్వారా ఇప్పటిదాకా 2500 మందికి పైగా పిల్లలను రక్షించారు.

ఇక ఇప్పుడు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళిగా తాజాగా మహేష్ దంపతులు 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్‌'ను ప్రారంభించారు. దీని ద్వారా పేద కుటుంబాలకు చెందిన 40 మంది పైగా మెరిట్ స్టూడెంట్స్ కి స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఆర్థిక సాయం చేయనున్నారు.

బాగా చదవగలిగినా పేదరికం కారణంగా చదువుకి దూరమైనవారు ఎందరో ఉంటారు. అలాంటి వారికి అండగా నిలబడటం కోసం మహేష్ ముందుకు రావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.