English | Telugu

SSMB29 vs AA22 .. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్..!

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పలు భారీ సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'SSMB29', అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న 'AA22' ప్రధానమైనవి. ఈ సినిమాలకు రూ.2000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగల సత్తా ఉందనే అంచనాలున్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశాలున్నాయనే వార్త.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్నారు. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా దీనిని మలుస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోవైపు 'AA22' ప్రాజెక్ట్ ని సైతం 2027 వేసవిని టార్గెట్ చేసుకునే తెరకెక్కిస్తున్నట్లు వినికిడి. 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తో గ్లోబల్ మార్కెట్ ని షేక్ చేయాలని.. బన్నీ, అట్లీ భావిస్తున్నారు.

కంటెంట్ పరంగా, కాంబినేషన్ పరంగా, బడ్జెట్ పరంగా ఇలా ఏ అంశం తీసుకున్నా.. 'SSMB29', 'AA22' రెండూ భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండూ ఒకేసారి విడుదలైతే మొదట ఏ సినిమా చూడాలో అర్థంకాని పరిస్థితి ప్రేక్షకుల్లో కూడా ఏర్పడుతుంది.

అయితే ఈ తరహా భారీ సినిమాలకు సోలో రిలీజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాగ్జిమమ్ థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. అలాంటిది ఒకేసారి రెండు భారీ సినిమాలు వస్తే.. థియేటర్ల సమస్య వస్తుంది. కలెక్షన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి, కనీసం నాలుగు వారాల గ్యాప్ ఉంటే మంచిది. 'SSMB29', 'AA22' రెండు మూవీ టీంలు మాట్లాడుకొని అందుకు తగ్గట్టుగా రిలీజ్ ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.