English | Telugu

తండ్రితో కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమైన శ్రుతి!

నటనలోనూ, నాట్యంలోనూ ఆరితేరిన కళాకారుడు కమల్‌హాసన్‌. ఆయన వారసురాలిగా వచ్చిన శ్రుతిహాసన్‌కు నటనతోపాటు మ్యూజిక్‌లోనూ ప్రవేశం ఉంది. ఇంతకుముందు ఆమె రెండు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేసింది. ఇప్పుడు మూడో ఆల్బమ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఆల్బమ్‌ కమల్‌హాసన్‌తో కలిసి చేస్తోంది శ్రుతి. దుబాయ్‌లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో కమల్‌హాసన్‌ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ ఆల్బమ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని శ్రుతి అంటోంది.

ప్రస్తుతం కమల్‌హాసన్‌ తన 233వ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ రియాలిటీ షో కోసం రెడీ అవుతున్నాడు. ఇక శ్రుతిహాసన్‌ పాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’లో ప్రభాస్‌తో జతకడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, నాని హీరోగా ‘హాయ్‌ నాన్నా’ చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, ‘ఎన్నై కేళుంగళ్‌’ అనే టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.