English | Telugu

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా సినిమా

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా, "కొత్తబంగారులోకం" ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమాకి "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు" అన్న పేరుని కూడా నిర్ణయించినట్లు అప్పట్లో బాగా వినపడింది.

కానీ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటిస్తున్న "దిషాడో" , కమిట్ అయిన "గబ్బర్ సింగ్" సినిమాలతో చాలా బిజీగా ఉండటంతో ఆయన ఈ సినిమాలో నటించట్లేదని తెలిసింది. దాంతో ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్ర కథను ప్రిన్స్ మహేష్ బాబుకి చెప్పాడట. ఆ కథ విన్న మహేష్ బాబు కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అన్నీ సరిగ్గా జరిగితే వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరూ కలసి నటించే సినిమాని ప్రేక్షకులు చూసే అవకాశం అతి తోందర్లోనే ఉంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.