English | Telugu

ఆ విషయంలో శ్రీలీల ఆల్రెడీ కమిట్‌ అయిపోయిందట!

అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి చక్కని అభినయం కూడా తోడైతేనే ఏ అర్టిస్ట్‌ కెరీర్‌ అయినా అద్భుతంగా కొనసాగుతుంది. అలాంటి అందం, అభినయం కలగలిసిన హీరోయిన్‌ శ్రీలీల. పెళ్లిసందడి, ధమాకా, భగవంత్‌ కేసరి, స్కంద చిత్రాల్లో ఆమె నటనతో, అందచందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ అందర్నీ అలరిస్తోంది. ప్రస్తుతం ఏ హీరో అయినా తన పక్కన శ్రీలీల హీరోయిన్‌ అయితే బాగుంటుంది అనే రేంజ్‌కి శ్రీలీల పాపులారిటీ పెరిగింది. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌ కూడా ఎక్కువే కాబట్టి.. శ్రీలీల తమ సినిమాలో ఉంటే సూపర్‌హిట్టేనన్న సెంటిమెంట్‌ కూడా బాగా వర్కవుట్‌ అవుతోంది. అందుకే ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.

సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుదది. శ్రీలీల. తాజాగా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. వారిలో ఒకరు ‘మీరు బిగ్‌ బాస్‌ షోకు వస్తున్నారా’ అని ప్రశ్నించాడు. దానికి ‘అవును.. ఆదికేశవ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ షోకు అటెండ్‌ అవుతున్నాను’ అంది. ఆ క్రమంలోనే మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఎంతో తెలివిగా సమాధానమిచ్చి అతనికి షాక్‌ ఇచ్చింది. ‘మీరు ఎవరికైనా కమిట్‌ అయ్యారా’ అని ప్రశ్నించాడా నెటిజన్‌. దానికి శ్రీలీల సమాధానమిస్తూ ‘అవును’ అని చెబుతూ ‘నా పనితో కమిట్‌ అయ్యాను. ప్రస్తుతం సినిమాలు చేయడమే నా పని’ అని సమాధానమిచ్చేసరికి ఆ నెటిజన్‌ షాక్‌ అయ్యాడు. ఫ్యాన్స్‌తో తన ముచ్చట్ల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది శ్రీలీల. నెటిజన్‌కి ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే.. వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ‘ఆదికేశవ’ చిత్రంలో నటిస్తోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో ‘గుంటూరు కారం’ చేస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. పవన్‌ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇవికాక మరి కొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటించే సినిమాలు నెలకి ఒకటీ, రెండు రిలీజ్‌ అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా శ్రీలీల నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.