English | Telugu

వామ్మో 'పుష్ప 2' మీద అంత నమ్మకమా.. రూ.97 కోట్లు ఏంటి సామి!

'పుష్ప' రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో సర్ప్రైజ్ హిట్ సాధించింది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో భాగం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 'పుష్ప-2' వరల్డ్ వైడ్ గా కనీసం రూ.1000 కోట్ల గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా కోట్ చేస్తున్నారు.

'పుష్ప 2'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు షూట్ జరుగుతున్న కొద్దీ అవుట్ పుట్ చూసుకొని, మేకర్స్ కి కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్లుంది. ఓవర్సీస్ రైట్స్ కోసమే ఏకంగా రూ.97 కోట్లు కోట్ చేస్తున్నారట. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' రూ.70 కోట్ల దాకా ఓవర్సీస్ బిజినెస్ చేయగా.. ఇప్పుడు 'పుష్ప 2' నిర్మాతలు తమ చిత్రానికి ఏకంగా రూ.97 కోట్లు కోట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 'పుష్ప 2' మీద నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తానికి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. మరి విడుదలకు ముందే ఇంతటి సంచలనాలు సృష్టిస్తున్న 'పుష్ప 2', విడుదల తర్వాత ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.