English | Telugu

పాన్ ఇండియా లెవెల్లో రికార్డు సృష్టించిన  స్కంద 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌లుగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సెప్టెంబర్‌లోవిడుదలయిన సినిమా స్కంద. రామ్ సినీ కెరీర్‌లోనే భారీ స్థాయి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ స్కంద ఇప్పుడు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.


స్కంద మూవీ రీసెంట్ గా ఓటిటి లోకి ఆడుగు పెట్టింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోను డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదల అయిన స్కంద సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్కంద చిత్రం స్ట్రీమింగ్ అయిన మొదటి నలభై ఎనిమిది గంటలు పాటు క్లాక్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోని ప్రేక్షకులు మొదటి రెండు రోజులలోనే విపరీతంగా స్కంద సినిమాని చూసారు. ఇంతవరకు హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇంత బజ్ దక్కలేదు. మొట్ట మొదటి సరిగా స్కంద మూవీ ఆ రికార్డు ని సాధించింది.

రామ్ పోతి నేని, బోయపాటి ల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన స్కంద మూవీ థియేటర్లలోనూ విజృంభించడంతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓటిటి లో కూడా విజృంభించడంతో రామ్ అభిమానులు, బోయపాటి అభిమానులు ఎంతో ఆనందంతో ఉన్నారు.చిత్ర యూనిట్ కూడా సంబరాలు చేసుకుంటుంది. అయితే కొంత మంది సోషల్ మీడియాలో బోయపాటి గత చిత్రాలకి సంబంధించిన సీన్స్ ని తీసుకొని స్కంద మూవీ సాధించిన పాన్ ఇండియా రికార్డు మీద ట్రోల్స్ చేస్తున్నారు


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.