English | Telugu

అమ్మ కోరిక తీర్చ‌నున్న మ‌హేష్‌ బాబు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త్వ‌ర‌లోనే త‌న తల్లి ఇందిరమ్మ కోరిక‌ను తీర్చ‌టానికి రెడీ అవుతున్నారంటూ సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు ఇంత‌కీ అమ్మ కోరిక‌ను తీర్చ‌టానికి మ‌హేష్ ఏం చేయ‌బోతున్నారు..అంత‌లా మ‌హేష్ అమ్మ‌గారు కోరిన కోరిక ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే, మ‌హేష్ పిల్ల‌లు గౌత‌మ్‌, సితారలు సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీతో క‌నిపిస్తూనే ఉంటారు. మ‌రీ ముఖ్యంగా సితార అయితే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రికి పోటీగా అప్పుడే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లోనూ న‌టించ‌టానికి రెడీ అయిపోయింది. ఈమెకు సంబంధించిన మ‌హేష్ ఓ శుభ‌కార్యాన్ని త‌న ఇంట్లో నిర్వ‌హించ‌బోతున్నారు. అది కూడా త‌ల్లి కోరిక మీద‌. అదేదో కాదు. ఓణీల ఫంక్ష‌న్‌.

మ‌హేష్ త‌ల్లి ఇందిరా దేవి..సితార ఓణీల ఫంక్ష‌న్‌ను చూడాల‌ని కోరుకుంది. అయితే వ‌య‌సురీత్యా అనారోగ్య కార‌ణాల‌తో ఆమె క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడా ఫంక్ష‌న్‌ను మ‌హేష్ ఘ‌నంగా చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల‌లోనే ఆ వేడుక‌ను మ‌హేష్ చేయాల‌నుకుంటున్నార‌ని మ‌హేష్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు సైతం ఈ ఫంక్ష‌న్‌కు భారీగానే విచ్చేస్తారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే మ‌హేష్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. రానున్న సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇందులో మ‌హేష్ సిక్స్ ప్యాక్ లుక్‌తో కనిపించ‌బోతున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్‌ను ఎవ‌రూ చూపించ‌ని మాస్ యాంగిల్లో త్రివిక్ర‌మ్ చూపించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.