English | Telugu

NBK 110 క్రేజీ అప్‌డేట్.. సుకుమార్‌తో బాల‌య్య‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 108వ చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి ఈ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న ఆడియెన్స్ ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న 109వ చిత్రాన్ని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టటం బాల‌య్య స్టైల్. అయితే ఈసారి అంత కంటే స్పీడుగా ఆయ‌న త‌న 110వ సినిమాను సిద్ధం చేయ‌టానికి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని టాక్ సినీ స‌ర్కిల్స్‌లో గ‌ట్టిగా వినిపిస్తోంది. అయితే ఈసారి వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు నందమూరి క‌థానాయ‌కుడు ఓ క్రేజీ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నారు. ఇంత‌కీ బాల‌య్య త‌న 110వ సినిమాలో కలిసి వ‌ర్క్ చేయాల‌నుకుంటున్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సుకుమార్ అని టాక్‌.

డిఫ‌రెంట్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ సుకుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు నంద‌మూరి హీరోల్లో ఎన్టీఆర్ మిన‌హా మ‌రెవ‌రితోనూ క‌లిసి వ‌ర్క్ చేయ‌లేదు. అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, నాగ‌చైత‌న్య వంటి వారితోనే వ‌ర్క చేశారు. ఇప్పుడు బాల‌కృష్ణ‌తో సుకుమార్ నిజంగానే సినిమా చేస్తే మాత్రం క‌చ్చితంగా బాల‌కృష్ణ‌ను ఆయ‌న మ‌రో కొత్త కోణంలో ఆవిష్క‌రిస్తార‌న‌టంలో సందేహం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య‌ను ఎవ‌రూ చూడ‌ని ర‌స్టిక్ లుక్‌తో ర‌ఫ్ ఆడించేలా చూపిస్తారు. కానీ ఈ వార్త‌ల్లో నిజానిజాలేంటో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని మీడియా సర్కిల్స్‌లో కొంద‌రి వాద‌న‌. ఎందుకంటే రానున్న ఎల‌క్ష‌న్స్‌ను బేస్ చేసుకుని బాల‌కృష్ణ త‌న 110వ చిత్రాన్ని త‌న‌కు అచ్చొచ్చిన డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుతో చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

బోయపాటి శ్రీను అయితే బాల‌య్య‌లోని మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూనే పొలిటిక‌ల్ ట‌చ్ ఇస్తూ సినిమాను చేస్తారు. మ‌రి సుకుమార్‌తో సినిమా చేస్తే అది మ‌రోలా ఉంటుందా..పొలిటిక‌ల్ ట‌చ్‌లో ఉంటుందా? అస‌లు సుకుమార్ పొలిటిక‌ల్ యాంగిల్‌లో విమ‌ర్శ‌లు చేస్తూ సినిమాలు చేస్తారా? అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.