English | Telugu

క‌మ‌ల్ థాయ్‌ల్యాండ్ పంపితే... తిరిగి వ‌చ్చేసిన శింబు

త‌మిళ స్టార్ శింబు ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆయ‌న బ‌రువు త‌గ్గి, నాజూగ్గా మారి, చేసిన సినిమా వెందు త‌నింద‌దు కాడు. ముంబైలో హోట‌ల్ న‌డుపుకునే త‌మిళులు, మ‌ల‌యాళీలు... అక్క‌డి లోక‌లి డాన్స్ కి ఎలా స‌పోర్ట్ చేస్తుంటారు? అన్యంపుణ్యం తెలియని యువ‌కులు ఆ ఉచ్చులో ఎలా కూరుకుపోతుంటారు? వంటి విష‌యాల‌ను డిస్క‌స్ చేసిన సినిమా వెందు త‌నింద‌దు కాడు. శింబుకి ల‌క్కీ డైర‌క్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ చిత్రం త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయింది.

ఈ స‌క్సెస్ మీద ఉన్న‌ప్పుడే ప‌త్తు త‌ల సినిమాలో న‌టించారు శింబు. ఈ చిత్రం మార్చి 30న విడుద‌ల కానుంది. క‌న్న‌డ‌లో మ‌ఫ్టీ పేరుతో విడుద‌లై పెద్ద హిట్ అయిన మూవీకి రీమేక్‌. ప‌త్తు త‌ల‌లో గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశారు శింబు. ఆయ‌న‌కు రీమేక్స్ చేయ‌డం ఇదేం కొత్త కాదు. ఇక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన గ‌బ్బ‌ర్‌సింగ్‌ని త‌మిళంలో రీమేక్ చేసింది శింబునే. ప‌త్తుత‌ల సినిమా ఆడియో వేడుక మార్చి 18న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.రెహ‌మాన్ లైవ్ కాన్స‌ర్ట్ కూడా ఇదే వేదిక మీద ప్లాన్ చేశారు. ఈ ఆడియో వేడుక కోసం థాయ్‌ల్యాండ్ నుంచి వ‌చ్చేశారు శింబు. థాయ్‌ల్యాండ్‌కి శింబు త‌నంత‌ట తానుగా వెళ్ల‌లేదు.

ఆయ‌న్ని పంపింది క‌మ‌ల్‌హాస‌న్‌. రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌నల్ నిర్మాణంలో ఓ చిత్రంలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు శింబు. ఆ సినిమాలోని కేర‌క్ట‌ర్ కోసం శింబుని థాయ్‌ల్యాండ్ పంపారు క‌మ‌ల్‌. కొన్ని మార్ష‌ల్ ఆర్ట్స్ నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డం కోసం, ఫిట్‌నెస్ ట్రైనింగ్ కోసం శింబుని థాయ్‌ల్యాండ్ పంపారు. అక్క‌డ శిక్ష‌ణ ఇంకా పూర్తికాలేదు. అంత‌లోనే ప‌త్తు త‌ల కోసం తిరిగి వ‌చ్చేశారు శింబు. క‌మ‌ల్ నిర్మిస్తున్న సినిమాకు దేశింగు పెరియ‌సామి డైరక్ట‌ర్‌. శింబు న‌యా స్టైల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.