English | Telugu

హన్సిక చాప్టర్ క్లోజ్ చేసిన శింబు

శింబు, హన్సికల ప్రేమాయణం ముగిసినట్లే అని గతకొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలకు వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుసుకునే ఉంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ కూడా స్పందించలేరు. తాజాగా శింబు తన ప్రేమాయణం ముగిసిందని ప్రకటించేసాడు. "ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నా. హన్సికతో బంధం ముగిసిన కథ. ఆ విషయం గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నా అభిమానులకు, స్నేహితులకు స్పష్టత ఇచ్చేందుకే ప్రేమ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తున్నా. ఇకపై నా కెరీర్ పైనే దృష్టిపెట్టదలచుకొన్నా. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది" అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

అయితే శింబు ఈ విధంగా హన్సికతో విడిపోవడానికి కారణం నయనతార మాత్రమే కారణమని అందరూ అనుకుంటున్నారు. ఇటీవలే వీళ్ళిద్దరూ మళ్ళీ క్లోజ్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న ఓ సినిమాలో భార్యభర్తలుగా నటిస్తున్నారు. అందుకే వీరి ప్రేమ మళ్ళీ మొదలవ్వడంతో శింబు... హన్సికను దూరం చేసాడని తెలుస్తుంది. త్వరలో నయనతార శింబులు పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి వీరిద్దరి ప్రేమాయణం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.