English | Telugu

సూర్యకి షాకిచ్చిన కామెడీయన్..!

టాలీవుడ్ భారీ అంచనాలతో నిన్న విడుదలైన ‘సికిందర్’ అన్నిటినీ తలకిందులు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాలలోను 400ల ధియేటర్లకు పైగా రిలీజైన ‘సికిందర్’కి, ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ కు అదే రెంజులో రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు సంబరపడ్డారు. కానీ మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రెండవ రోజు కలెక్షన్లు నిరసించాయి. కానీ అదే రోజు రిలీజైన తెలుగు సినిమా 'లవర్స్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలో మంచి కామెడీ వుండడంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కామెడియన్ 'సప్తగిరి'కి ఇస్తున్నారు సినీ విమర్శకులు. ఇప్పుడు ఆమె సినిమాకు అతనే హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ మరో రెండు వారాలు చెప్పుకోతగ్గ సినిమాలు లేకపోవడంతో 'సప్తగిరి' నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాడని విశ్లేషకులు అంటున్నారు. దీంతో టాప్ లో దూసుకెల్తాడని భావించిన ‘సికిందర్’కి కామెడియన్ 'సప్తగిరి' ఝలక్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.