English | Telugu

అల్లు అర్జున్ మూవీలో నయనతార?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించబోతున్నాడనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం నయనతారని తీసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో అల్లుఅర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు. వీరిలో ఒక హీరోయిన్ గా సమంత ఎంపిక చేశారు. మరో ఇద్దరినీ ఎంపిక చేయాల్సి వుంది. నయనతార చేయబోయే పాత్ర గురించి బయటికి రివీల్ చేయకూడదని త్రివిక్రమ్ తన యూనిట్ కి చెప్పినట్లు సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.