English | Telugu

నన్ను ఫ్లర్ట్ చెయ్యాలని చూసారు..ఓ.జి నటి ఆరోపణ   

బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని శుభశ్రీ అనే ఒక అందమైన అమ్మాయి తెలుగు సినీ పరిశ్రమలో ఉందని కొన్ని సినిమాల్లో కూడా నటించిందనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలిసింది. ఒరిస్సా కి చెందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలుగులో మాట్లాడుతూ తెలుగు సినిమా ల గొప్పతనం గురించి కూడా చెప్పి అందరిని తన మాటలతో కట్టిపడేసింది. అలాగే పరిశ్రమలో తనకెదురైన ఒక సంఘటన గురించి దైర్యంగా చెప్పి ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.నందమూరి కళ్యాణ్ రామ్ తో అమిగోస్ తో పాటు రుద్రవీణ,కథ వెనుక కథ ఇలా పలు చిత్రాల్లో నటించిన శుభశ్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నయా మూవీ ఓ .జి లో నటించే ఛాన్స్ ని దక్కించుకొని ఒక్కసారిగా శుభశ్రీ అందరి దృష్టిలో పడింది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన శుభశ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూ లో నాకైతే ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని కాకపోతే ఒక ఈవెంట్ లో ఫ్లర్ట్ చెయ్యబోయారని చెప్పింది. తనకు ఇంతవరకు బాయ్ ఫ్రెండ్స్ లేరని విజయ్ దేవరకొండతో కలిసి డిన్నర్ చెయ్యాలని ఉందని అలాగే పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. పక్కా ఒరిస్సా కి చెందిన శుభశ్రీ తండ్రి ఒక జడ్జి. అలాగే తనకి ఒక అక్క తమ్ముడు ఉన్నారు .ఎప్పటికైనా శుభశ్రీ మంచి నటి అనే పేరు సంపాదించాలనే లక్ష్యంతో ఆమె ముందుకు వెళ్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.