English | Telugu

వృద్ధురాలి పాత్రలో శృతిహాసన్

కమల్ హాసన్ కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా తన తండ్రి పేరును మరింత పెంచేస్తున్న హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టవుతున్నాయి. ఒకప్పుడు ఐరెన్ లెగ్ అని పిలిచిన హీరో, దర్శక, నిర్మాతలే ఇపుడు గోల్డెన్ లెగ్ అంటూ తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. కానీ శృతి మాత్రం తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటుంది.

ప్రస్తుతం శృతి "బిచ్డే సభి బారి బారి" అనే చిత్రంలో నటించనుంది. ఇందులో శృతి అందమైన యువతిగా మరియు ఓ వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. కమల్ వలె పలు విభిన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఈ చిత్రంపై శృతి చాలా నమ్మకంతో ఉంది.అదే విధంగా శృతి ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. మరి ఈ చిత్రాలన్నీ ఘన విజయం సాధించి శృతిని టాప్ 1 స్థాయికి చేర్చాలని ఆశిద్దాం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.