English | Telugu

ఈ నెల 11తో  విజయశాంతి బాటలోకి కాజల్ వెళ్లనుందా? 

కాజల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సత్య భామ. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఈ నెల 11 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆల్రెడీ 60 % కి పైగా చిత్రీకరణని జరుపుకున్న సత్యభామ మూవీ ని మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన కాజల్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలని పెంచాయి.

2007 లో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరంగా ఉంటు వస్తున్న కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఇటీవలే బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీలో నటించి అందర్నీ మెప్పించింది.ఈ నెల 11 న విడుదల అవుతున్న సత్యభామ టీజర్ ద్వారా కాజల్ ఏం చెప్పబోతుందో అని అందరు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయితే కాజల్ విజయశాంతి బాటలోకి వెళ్లి టైటిల్ రోల్స్ క్యారక్టర్లనే ఇకపై చేస్తుందేమో అని అనుకుంటున్నారు శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సత్య భామ మూవీ ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తుండగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.