English | Telugu

KGF Actress:‘కెజిఎఫ్‌’ నటిపై పోలీస్‌ కేసు... కాపాడిన వీడియో కాల్‌! 

యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కెజిఎఫ్‌’ చిత్రంలో నటించిన మాళవిక అవినాష్‌కు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చింది. 1988లోనే కెరీర్‌ స్టార్ట్‌ చేసిన మాళవిక లెక్కకు మించిన సినిమాల్లో నటించి, పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ‘కెజిఎఫ్‌’తో తెలుగువారికీ పరిచయమైంది. తాజాగా మాళవిక అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేశారని ట్రాయ్‌ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల ట్రాయ్‌ నుంచి ఆమెకు ఫోన్‌ కాల్‌ కూడా వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ట్రాయ్‌నుంచి ఫోన్‌ వచ్చింది. నా మొబైల్‌ నెంబర్‌ను కట్‌ చేస్తామని చెప్పారు. మరింత సమాచారం కోసం 9కి ఫోన్‌ చేయమని చెప్పారు. నేను ఫోన్‌ చేశాను. నా నెంబర్‌ డిస్కనెక్ట్‌ చేయవద్దని ట్రాయ్‌ అధికారుల్ని కోరాను. ఆధార్‌ కార్డును తప్పుగా వాడి సిమ్‌ తీసుకోలేదని వారికి చెప్పాను. తర్వాత వారు పోలీసులకు కూడా ఫోన్‌ కలిపారు. నాతో మాట్లాడిన ఎస్‌ఐ కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు. నన్ను ముంబై వచ్చి కంప్లయింట్‌ ఇవ్వమన్నాడు. నేను ఓ నటిని అని చెప్పే ప్రయత్నం చేశాను. అతను వినలేదు. నేను వీడియో కాల్‌ చేసినపుడు నన్ను కేజీఎఫ్‌ నటి అని గుర్తించాడు. వెంటనే నాకు అండగా నిలిచాడు. నా స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలన్నాడు. స్టేట్‌మెంట్‌ కోర్టు ముందు ఉంచుతామని ఆ పోలీస్‌ చెప్పాడు. దీన్ని బట్టి ఆధార్‌ కూడా పాస్‌ పోర్టులా చాలా ముఖ్యమైందని అర్థమైంది’ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.