English | Telugu

సంజయ్ దత్ కి భారీ స్థాయిలో డబ్బులు చెల్లిస్తున్న పూరి జగన్నాధ్

90 వ దశకంలో బాలీవుడ్ ని ఏలిన ఎంతో మంది అగ్ర హీరోల్లో సంజయ్ దత్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన సంజయ్ దత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నాడు. తాజాగా ఆయన రామ్ పోతినేని, పూరి ల కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయ్యింది

పూరి జగన్నాధ్ ,రామ్ పోతినేని కాంబోలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడనే విషయాన్ని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఈ మూవీ లో ని తన క్యారక్టర్ కి సంబంధించి సంజయ్ దత్ అక్షరాల 6 కోట్ల రూపాయలని తీసుకుంటున్నాడనే వార్త ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా లు రూపుదిద్దుకుంటున్న దగ్గర నుంచి సంజయ్ దత్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. కెజిఎఫ్ 2 తో పాటు లేటెస్ట్ గా వచ్చిన లియో మూవీలో సంజయ్ దత్ చేసిన విజృంభణ అందరి తెలిసిందే. ఇప్పుడు పూరి, రామ్ పోతినేని ల డబుల్ ఇస్మార్ట్ లో కూడా సంజయ్ దత్ విజృంభణ ఖాయమని అంటున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగిన గొప్ప నటుడు సంజయ్ దత్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 90 వ దశకం నుంచే తెలుగులో ఆయనకీ అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ ని ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ. పాన్ ఇండియా సినిమా లు ప్రారంభం అయిన దగ్గర నుంచి సంజయ్ దత్ హవా ప్రారంభం అయ్యిందంటే సంజయ్ దత్ ఎంత గొప్ప పాన్ ఇండియా నటుడో అర్ధం చేసుకోవచ్చు. ఎలాంటి క్యారెక్టర్ లో అయిన సూపర్ గా నటించి ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా చెయ్యడం సంజయ్ దత్ స్టైల్. అందుకే సంజయ్ దత్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాణ సంస్థలు వెనుకాడటం లేదు. పైగా సంజయ్ దత్ సినిమాలో ఉండటం వలన పాన్ ఇండియా లెవల్లో ఆ సినిమాకి క్రేజ్ ఉంటుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.