English | Telugu

భ్రష్టు పట్టిన టాలీవుడ్..!!

తెలుగు సినిమా స్టాండర్డ్స్ మరీ అంత దిగజారిపోయాయా? ఎవడు పడితే వాడు హీరో అయిపోవచ్చా? రంగు,రూపు, అందం, చందం, అభినయం ఏమీ అవసరం లేదా? ముఖానికి రంగేసుకుని బిల్డప్ లు ఇస్తేచాలా? వీటన్నింటికీ అవుననే చెప్పాలేమో!. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లుకూడా హీరోలైపోతున్నారంటే తెలుగుసినిమా దౌర్భాగ్యం కాక మరేంటి!

ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ తెరవేల్పులుగా వెలిగారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నారు. నటన అంటే అంతెత్తున చూసేవారు. అలాంటిది నేటి ప్రేక్షకులకు పిచ్చేమీ పట్టలేదు కదా? లేదంటే సంపూర్ణేశ్ బాబు హీరో ఏంటండీ? . హృదయం కాలేయంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూకి బర్నింగ్ స్టార్ అనే బిరుదు తనకు తనే ఇచ్చుకున్నాడు. నాలుగు అతి డైలాగ్స్, ఆరుగులు హీరోల్ని ఇమిటేషన్ తప్ప దేనికీ పనికిరాడు. ఏదో పేద్ద నటదిగ్గజాన్ని మిస్సైపోతున్నాం అన్నట్టు వరుస పెట్టి ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. కుర్రాడు కూడా ఎక్కువ ఫీలై హీరోగా వరుస సినిమాలు తీస్తున్నాడు. సంపూ చంపుతున్నాడన్న సంగతి ఏ ఒక్కరికీ అర్థంకావడం లేదా?

అయినా ఈ కుర్రాడి అని ఏం లాభం లెండి. ఇండస్ట్రీలో దిగ్గజాలంతా....ఎగేసుకుని మరీ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. ముఖ్యంగా దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు సంపూ అంటే సూపర్ స్టార్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి హీరోల వల్ల వాళ్లకేమైనా ఉపయోగం ఉందా అంటే అదీ లేదు. కానీ వాళ్లకి నచ్చని వాళ్లని తిట్టేందుకు....టార్గెట్ చేసేందుకు సంపూ ఓ పావు మాత్రమే. అసలు సంపూని ఏం చూసి పొగుడుతున్నారో అంతుచిక్కడం లేదు. వీళ్లు చాలరన్నట్టు టాలీవుడ్ జక్కన్నగా పేరుసంపాదించుకున్న రాజమౌళికి నిత్యం వార్తల్లో ఉండకపోతే నిద్రపట్టదాయె. అందుకే తిండైనా మానేస్తాడు కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ని వదిలిపెట్టడు. అసలు సంపూని ప్రేక్షకులమీదకి వదిలిన పాపం రాజమౌళిదే. ఆ మాహానుభావుడి ట్వీట్ తోనే ఈ సింగం దాడిచేస్తోంది.

కోట్లాది ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునే కళారంగం క్వాలిటీ ఈ స్థాయికి దిగజారిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. కేవలం అందంగా లేడనే సంపూని విమర్శిస్తున్నాం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కళకు అందం కొలమానం కాదు. రజనీకాంత్, ప్రభుదేవా, లారెన్స్, ధనుష్, అల్లరి నరేశ్ ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అందగాళ్లేం కాదు. కానీ వాళ్లలో టాలెంట్ ఉంది. నటనా సామర్థ్య ఉంది. ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయి ఆదరణ వారికి దక్కలేదు. అలాంటి కళారంగంలో ఏ ఒక్క టాలెంట్ లేని సంపూర్ణేశ్ బాబు వీరంగం సృష్టిస్తున్నాడు. పైగా హీరోగా ఆదరించి పిలిచి మరీ లైవ్ లో కూర్చోబెడుతున్నారంటే ఛానెల్స్ సైతం ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే విషయం లేని వారసులు ఇండస్ట్రీపై దాడికిదిగారు. ఎన్ని దండయాత్రలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్టవడం లేదు. అయినా బాగా సంపాదించిన బాబులు...వారికి వారే సమర్పించేసుకుని ప్రేక్షకులని హింస పెడుతూనే ఉన్నారు. వీరినే భరించలేకపోతున్నాం దేవుడా అంటే సంపూర్ణేశ్ బాబులాంటి వాళ్లు సైతం తెరపై అరాచకాలు సృష్టిస్తున్నారు.అయినా ఇతర బాషా చిత్రాలకు అవార్డులు వస్తాయి కానీ తెలుగు సినిమాలకు రావని తెగబాధపడిపోతుంటారు. ఇలాంటి వాళ్లంతా హీరో అవతారం ఎత్తితే అవార్డులు సైతంభయపడి పారిపోతున్నాయి. పోనీ అందులో ఏదైనా సందేశం అయినా ఉందా అంటే అంతసీన్ లేదు. ముక్కూ మూతి తిన్నగా లేని హీరో కోసం కూడా హీరోయిన్స్ పోటీపడినట్టు చూపిస్తారు. ఇదెంత దారుణం చెప్పండీ?

ఇలాంటి వాళ్లంతా హీరోలుగా మారుతున్నప్పుడు, అభినయానికి విలువ లేనప్పుడు అవార్డుల గురించి పెద్దలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఏదిఏమైనా ఇకనైనా ప్రేక్షకులు కళ్లు తెరవండి. కళారంగాన్ని కాపాడండి. విషయం లేని హీరోలను, విలువల్లేని పెద్దాళ్లకు బుద్ధిచెప్పండి. ఎలాంటి టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేనే భయం పుట్టేలా చేయండి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.