English | Telugu

ఇంత‌లో ఎంత మార్పు

న‌న్ను చూడాలంటే సినిమాల్లోనే చూడాలి.. యాడ్స్‌, ప్ర‌మోష‌న్స్ నా ఒంటికి స‌రిప‌డ‌వంతే.. అంటూ ద‌శాబ్ద‌కాలంగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వ‌చ్చింది కేర‌ళ కుట్టి న‌య‌న‌తార‌. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌. ఎందుకంటే.. ఇప్పుడిప్పుడే న‌య‌న‌లోనూ కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి మ‌రి. ఆడ‌పాద‌డ‌పా సినిమా ప్ర‌మోష‌న్స్‌కు అటెండ్ అవుతోంది. అంతేకాకుండా ఎప్పుడూ లేని విధంగా ఈ స‌న్న‌జాజి సోయ‌గం కొత్త‌గా యాడ్స్‌లోనూ క‌నువిందు చేస్తోంది. తాజాగా.. జి.ఆర్‌.టి.జ్యూవెల‌ర్స్ కోసం న‌య‌న‌తార వివిధ భంగిమ‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తూ త‌న అభిమానుల్లో మ‌రింత హుషారు పుట్టించే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. న‌య‌న వైనం చూసి ఇంత‌లో ఎంత మార్పు అంటూ తోటి తార‌లు బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.