English | Telugu

కిచ్చాని మర్చిపోయిన సమంత

అందాల ముద్దుగుమ్మ సమంత నాగచైతన్యకు జతగా నటించిన మూడో చిత్రం ‘ఆటో నగర్ సూర్య’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ఆటో నగర్ సూర్య’లో సమంత అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ... దేవా కట్టా, నాగచైతన్య సినిమా కోసం చాలా కష్టపడ్డారంటూ ‘ఆటో నగర్ సూర్య’ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు నా కృతజతలు అని అన్నారు. ఇక ఈ సినిమాలో ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషించిన మరో హీరో నందు గురించి చెప్పడం మర్చిపోయానంటూ.. తర్వాత ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. కిచ్చా పాత్రలో నందు నటన సూపర్బ్ అని పేర్కొంది సమంత.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.