English | Telugu

మళ్ళీ లొల్లి షురూ చేసింది

రోజు రోజుకి సమంత తీరు మితిమీరిపోతుంది. మొన్న మహేష్ నటించిన "1" చిత్ర పోస్టర్ గురించి రచ్చ చేసింది. అయితే తాజాగా కోలీవుడ్ లో కూడా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న "అంజాన్" లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. అందులో కేవలం సూర్య ఫోటో మాత్రమే ఉండటం వల్ల మళ్ళీ తన తిక్కతో పెద్ద చర్చకి తెరలేపింది. ఈ విషయంపై సమంత ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..."ఈ ఫీల్డ్‌లో హీరోలదే డామినేషన్ ఎక్కువ. దానికి సూర్య కూడా అతీతుడు కాడని తేలిపోయింది. స్త్రీలకు సినీ పరిశ్రమలో సమగౌరవం లభిస్తుందనడం అసత్యం. "అంజాన్" చిత్రం ఫస్ట్‌లుక్‌లో నా ఫొటో లేకపోవడమే అందుకు పెద్ద నిదర్శనం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తుంది. మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.