English | Telugu

స‌మంత ట్రైల‌ర్ విడుద‌ల‌య్యేది అప్పుడే!

స‌మంత అభిమానులు మంగ‌ళ‌వారం త‌ల్ల‌డిల్లిపోయారు. షూటింగ్ లో స‌మంత చేతికి గాయాల‌వ్వ‌డంతో, గెట్ వెల్ సూన్ అంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. మ‌రికొంద‌రైతే, అస‌లే అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు, ఇంత త్వ‌ర‌గా ఎందుకు షూటింగులకు వెళ్లావు, నీ క‌మిట్‌మెంట్ చూస్తుంటే పొగ‌డాలో, విసుక్కోవాలో అర్థం కావ‌డం లేదు అని అంటున్నారు. స‌మంత షూటింగ్‌లో గాయ‌ప‌డ్డార‌నే వార్త క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. అయితే అదే రోజు సాయంత్రం ఆమె అభిమానుల‌ను మ‌రో వార్త ఊరించింది. అది సిటాడెల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ విష‌యం. అయితే ఈ సిటాడెల్ స‌మంత‌కు సంబంధించిన‌ది కాదు.

ప్రియాంక చోప్రాకు సంబంధించిన సిటాడెల్ న్యూస్‌. హాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న సీరీస్ సిటాడెల్‌. ఈ వెబ్‌సీరీస్ ప్రైమ్ ట్రైల‌ర్‌ని బుధ‌వారం విడుద‌ల చేస్తారు. యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే థ్రిల్ల‌ర్ త‌ర‌హా స‌బ్జెక్టుతో తెర‌కెక్కిస్తున్నారు. అక్క‌డ ప్రియాంక చోప్రా కీ రోల్ చేస్తున్నారు. గ‌త కొన్ని యుగాలుగా ఈ ట్రైల‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్ప‌టికి విడుద‌ల చేస్తున్నార‌ని తెలిసి ఆనందంగా ఉంది అని కామెంట్ చేశారు ఓ నెటిజ‌న్‌. ఇంకా వెయిట్ చేయ‌డానికి ఓపిక లేదు క్వీన్ అని అన్నారు మ‌రో నెటిజ‌న్‌. ట్రైల‌ర్ చూసి ఎలా ఉందో చెప్ప‌మ‌ని ఊరిస్తున్నారు నిక్ జోనాస్‌. ఏప్రిల్ 28నుంచి ఈ సీరీస్‌ని ప్ర‌సారం చేస్తామ‌ని అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ప్ర‌తి శుక్ర‌వారం కొత్త ఎపిసోడ్‌ని ప్ర‌సారం చేస్తారు. మే 26 వ‌ర‌కు ఈ ప్ర‌సారాలు సాగుతాయి.

ప్రియాంక చోప్రాతో రిచ‌ర్డ్ మ్యాడ‌న్ న‌టిస్తున్న సీరీస్ ఇది. మ‌న ద‌గ్గ‌ర ఇదే సీరీస్‌లో స‌మంత న‌టిస్తున్నారు. ఆమెతో పాటు వ‌రుణ్‌ధావ‌న్ కీ రోల్ చేస్తున్నారు. త‌న అభిమాన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేస్తున్నారు స‌మంత‌. స‌మంత సిటాడెల్ ట్రైల‌ర్ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల‌వుతుంద‌ని టాక్‌. షూటింగులో గాయ‌ప‌డ్డ‌ప్ప‌టికీ, కాసేపు రెస్ట్ తీసుకుని వెంట‌నే మ‌ళ్లీ స్పాట్‌లోకి వెళ్లార‌ట స‌మంత‌. ఆమె డెడికేష‌న్ చూసి మురిసిపోతున్నారు మేక‌ర్స్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.