English | Telugu

'మంగళవారం'లో పాయల్ రాజ్‌పుత్!

'ఆర్‌ఎక్స్‌ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో చిత్రంగా శర్వానంద్, సిద్ధార్థ్ తో కలిసి ఆయన తీసిన 'మహాసముద్రం' మంచి అంచనాలతో విడుదలై తీవ్ర నిరాశపరిచింది. దీంతో తన మూడో సినిమాని పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా తీసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి 'మంగళవారం' అనే ఆసక్తికర టైటిల్ పెట్టినట్టు ఇప్పటికే న్యూస్ వినిపించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ని రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది.

అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమైన 'ఆర్‌ఎక్స్‌ 100'తోనే పాయల్ రాజ్‌పుత్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రంలో కార్తికేయకు జోడీగా నటించిన ఆమె తన గ్లామర్ తో కుర్రకారుని ఫిదా చేసింది. ఆ ఒక్క చిత్రం ఆమెకు తెలుగులో ఎన్నో అవకశాలు వచ్చేలా చేసింది. అయితే ఆమెకు ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. ఈ క్రమంలో అజయ్ భూపతి ఆమెకు మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

'మంగళవారం' అనే టైటిల్ తో అజయ్ ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తున్నట్టు సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమ, వినోదంతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట. పాయల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ స్వయంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది అంటున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.