English | Telugu

ట్రిపుల్ ఆర్ సినిమా... ఆ విష‌యాన్ని గ‌మ‌నించారా?

ఏంటి ట్రిపుల్ ఆర్ విడుద‌లై అప్పుడే ఏడాది పూర్త‌యిందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు జ‌నాలు. చూస్తూ ఉండ‌గానే కాలం క‌ర‌గ‌డ‌మంటే ఇదేనా అంటూ నివ్వెర‌పోతున్నారు. మూడు, నాలుగేళ్లుగా వార్త‌ల్లోనే ఉంది ట్రిపుల్ ఆర్‌. ప్యాండ‌మిక్ స‌మ‌యంలోనూ, ఆ త‌ర్వాత‌, సినిమా విడుద‌లైన‌ప్పుడు, విశ్వ‌వ్యాప్తంగా జ‌య‌జ‌య‌ధ్వానాలు అందుకున్న‌ప్పుడు... వార్త‌ల్లో ఉంటూనే ఉంది ఈ సినిమా. అంతే సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌చార కార్య‌క్ర‌మాల సంగ‌తి ఒక ఎత్త‌యితే, సినిమా విడుద‌ల‌య్యాక ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో ఢంకా భ‌జాయించి విజ‌య‌గ‌ర్వంతో వ‌చ్చిన సంగ‌తి మ‌రోతీరు. ఈ ఏడాది ఆస్కార్ వేదిక మీద నాటు ఘాటును చూపించింది ట్రిపుల్ ఆర్ సినిమా. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ స‌త్తా చాటింది. ఎన్నో ద‌శాబ్దాలుగా ర‌జ‌నీకాంత్ పేరు మీద జ‌పాన్‌లో ఉన్న రికార్డుల దుమ్ముదులిపి కొత్త ర‌క్తం వ‌చ్చింద‌ని స‌గ‌ర్వంగా చెప్పి వ‌చ్చింది. ఒక‌టా, రెండా రాజ‌మౌళి గ‌డిపిన నిద్ర‌లేని రాత్రులు ఎన్నెన్నో. వాట‌న్నిటికీ ఫ‌లితం ద‌క్కింది. ట్రిపుల్ ఆర్ అంటే ఇప్పుడు దేశం మీసం మెలేసే విష‌యం. ఆస్కార్ క‌ల‌ల‌ను సాకారం చేసిన అంశం. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, శ్రియా శ‌ర‌ణ్ అంటూ స‌రిహ‌ద్దులు చెరిపేసి స్టార్లంద‌రూ యాక్ట్ చేసిన చిత్రం.

ఈ సినిమా విడుద‌లై ఏడాది అయిన సంద‌ర్భంగా అంద‌రూ ట్రిపుల్ ఆర్ సీక్వెల్ గురించి ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్‌కి పాయింట్ చెప్పాను, రాజ‌మౌళి ఒప్పుకున్నారు అని హింట్ ఇచ్చారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. క‌థ డ్రైవ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నేను చెప్ప‌నోచ్ అంటూ ఊరిస్తున్నారు కాల‌భైర‌వి. స్వ‌రాల‌తో నేను సిద్ధంగానే ఉంటాన‌ని అంటున్నారు కీర‌వాణి.
మ‌రి రాజ‌మౌళి ఏమంటారు? ఇప్పుడు మ‌హేష్ సినిమా ప‌నుల‌కు శ్రీకారం చుడుతున్న జ‌క్క‌న్న ట్రిపుల్ ఆర్ రెండో భాగాన్ని ఎలా ఊహించుకుంటున్నారు? ఆ ఊహ‌ల‌ను మ‌న‌తో ఎప్పుడు షేర్ చేసుకుంటారు? ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.